ములుగు జిల్లా ఉపాధ్యాయ సంఘం (పి ఆర్ టి యు) ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముంజల భిక్షపతి గౌడ్ పి ఆర్ టి యు చేస్తున్న డిమాండ్లకు మద్దతుపలికారు.
ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల ఉద్దేశించి మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో 44 రోజులు సకల జనుల సమ్మె చేశారని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోవడం చాలా సిగ్గుచేటని ముంజల బిక్షపతి అన్నారు.
మోడల్ స్కూల్ కస్తూరిబా ఉపాధ్యాయుల సమస్యలు కూడా పరిష్కరించాలని ముంజల బిక్షపతి డిమాండ్ చేశారు.