ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజాదివస్ కార్యక్రమాన్ని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ సోమవారం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల ఫిర్యాదులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వృద్ధాప్యంలో వారసులు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలు ఫిర్యాదు వచ్చాయి. అదేవిధంగా భూ వివాదాలు , కుటుంబ, వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్ధిక లావాదేవీలు, భార్యభర్తల సమస్యలపై కూడా ఫిర్యాదులు వచ్చాయి. బాధితులు చేసిన ఫిర్యాదులపై క్షేత్రస్దాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల SHO అధికారులను కమిషనర్ ఆదేశించారు.