37.2 C
Hyderabad
March 28, 2024 18: 52 PM
Slider ఖమ్మం

భారీ హోర్డింగ్ లతో ప్రచారం

#cpm

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు ఖమ్మం నగరంలో ఈనెల 29,30,31వ తేదీలో ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా లక్ష మంది ప్రజలతో ఈనెల 29న ఇల్లెందు రోడ్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హాజరు అవుతున్నారు. ఈ క్రమంలో నగరంలో పలు సెంటర్స్ లో భారీ హోల్డింగ్ లను ఏర్పాటు చేశారు. ఎన్‌ఎస్‌టి రోడ్ లో వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోల్డింగ్ లను రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, అభిమానులు కదలి వచ్చి బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  నాయకులు యర్రా శ్రీకాంత్, వై విక్రమ్ , నర్రా రమేష్, భుక్యా.ఉపేంద్ర, డి నాగరాజు, ఇ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Related posts

బాసరలో భక్తుల సందడి: వైభవంగా వసంత పంచమి వేడుకలు

Satyam NEWS

ఖైరతాబాద్ ప్రాంతాన్ని క్వారంటైన్ చేస్తున్న అధికారులు

Satyam NEWS

ప్యాలెస్ క్లోస్డ్:దలైలామా అధికారిక నివాసం మూసివేత

Satyam NEWS

Leave a Comment