భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత సిపిఎం పార్టీ జాతీయ మొట్టమొదటి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం గోపాలపురం గ్రామంలో ఘనంగా జరిగింది. సిపిఎం పార్టీ ఆఫీస్ వద్ద సిపిఎం పార్టీ మండల కార్యదర్శి సీతయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుందరయ్య జీవితమంతా పేద ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి అని కొనియాడారు. కుటుంబ నియంత్రణ చేసుకొని తనకున్న ఉన్న భూమిని పేదలకు పంచి పెట్టిన గొప్ప మహానీయుడని ఆయన అన్నారు. సుందరయ్య ఎంపీ గా ఉన్న సమయంలో సైకిల్ పై పార్లమెంట్ కి వెళ్లారని, అసెంబ్లీకి సైకిల్ పై వెళ్లారని గుర్తు చేశారు.
పేద ప్రజల సమస్యలు అసెంబ్లీలో, పార్లమెంట్ లో మాట్లాడే వారని తెలిపారు. సుందరయ్య బాటలో అందరూ నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మాజీ సర్పంచ్ చేకూరి తిరుపతయ్య, వార్డు నెంబర్ మాధవరావు, చందాల బిక్షం, మండవ గురవయ్య, అనంత వెంకట రామయ్య, శాసనాల సత్యనారాయణ, పాల్గొన్నారు.