పేదలకు పెన్నిది, ఆదర్శమూర్తి పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి స్పూర్తిదాయకమని CPM కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం నాడు CPM ఆధ్వర్యంలో జరిగిన సుందరయ్య వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
నీతి నిజాయితీగా,నిరాడంబరంగా కమ్యూనిస్టు ఉద్యమాలకు బాసటగా నిలిచిన మహానుభావుడు సుందరయ్య అని అన్నారు. పార్లమెంటుకు సాధారణ సభ్యుడిగా సైకిల్ మీద వెళ్ళి ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రజా నాయకులని, భూస్వామ్య కుటుంబంలో జన్మించినా నిరుపేద కుటుంబాలకు అండగా అనేక పోరాటాలకు నాయకత్వం వహించారని అన్నారు.
ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు జిట్ట నగేష్, పామనుగుల్ల అచ్చాలు,మండల నాయకులు నారబోయ్న శ్రీనివాసులు, శీలా రాజయ్య, రుద్రారపు పెద్దలు, కత్తుల లింగుస్వామి, నర్సింహ, స్వామి, దుర్గేష్,హరి తదితరులు పాల్గొన్నారు.