సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఫణిగిరి సీతారామచంద్ర స్వామి గుట్ట ఆదర్శ కాలనీ ఇండ్ల సాధన కమిటీ సభ్యులు బుధవారం సీతారామచంద్ర స్వామి వారికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు యల్క సోమయ్య గౌడ్, కార్యదర్శి మందడి విశాల మాట్లాడుతూ డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకు మంజూరు కావాలని, శాసనసభ్యుడు సైదిరెడ్డి పేద ప్రజలు ఎదుర్కొంటున్న సొంతింటి కలను గుర్తించి, వారిపై దృష్టి సారించి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కొరకు చొరవ చూపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి, కాసాని ఆంజనేయులు,గండు నర్సయ్య,నందిపాటి సైదులు, భీమపంగు విజయ, ఊటుకూరి రాణి, బత్తిని సుగుణ,దుగ్గి అనిత,కస్తాల దేవి,తదితరులు పాల్గొన్నారు.