పంజాబ్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రారంభించింది. పార్టీలో అంతర్గత సమస్యను పక్కన పెట్టి ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు.
వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన 13 పాయింట్ల అజెండాను లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ స్థానంలో చన్నీకి బాధ్యతలు అప్పగించారు. మరోవైపు అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన సిద్ధూ ఆ తరువాత తిరిగి పీసీసీ బాధ్యతలు చేపట్టారు.