బొగ్గు కొరత విద్యుత్తు ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. బొగ్గు కొరత కారణంగా పంజాబ్లో విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. మూడు థర్మల్ విద్యుత్ ప్లాంట్లను మూసివేయాల్సి వచ్చింది. తమ రాష్ట్రానికి బొగ్గు సరఫరా పెంచాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ కేంద్రాన్ని అభ్యర్థించారు.
రాష్ట్రంలో 5,620 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఉన్నా ప్రస్తుతం 2,800 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. పంజాబ్లో ఇప్పటికే ఐదు థర్మల్ పవర్ ప్లాంట్లు మూసివేశారు. బొగ్గు కొరత కారణంగా రోపర్లో రెండు, తల్వంతి సాబోలో రెండు, లెహ్రా మొహబ్బత్లో ఒకటి మూసివేశారు.