సంగీతానికి నెలవైన విజయనగరంలో కర్ణాటక సంగీత పితామహలైన పురందర దాసు సంస్మరణ జరిగింది.
నగరంలోని మఠం వీధి శ్రీవేణుగోపాల స్వామి టెంపుల్ లో ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్, జానకిరామసేవాసమితి ,ఉత్తరాది మఠం సంయుక్త నిర్వహణలో …. సంగీత పితామహులు పురందర దాసు సంస్మరణ సభ జరిగింది.
అంతకుముందు సంస్థ సభ్యులు…పురందర దాసు చిత్రపఠానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మఠం ప్రధానార్చకులు హృషీకేశ్ పూజలు నిర్వహించారు. మేనేజర్ రఘోత్తమాచార్య పురందర దాసుల జీవితములోని విషయాలు తెలిపారు.
ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ కార్యదర్శి డాక్టర్ మండపాక రవి సభాకార్యక్రమాన్ని నిర్వహించగా స్థానిక విద్వాంసులు వాసా సాయిజానకి,ధన్వాడ శ్రీనివాసరావు, సుబ్బారావు, తదితరులు దేవరనామాలు గానం చేయగా వయోలిన్ పైన ఈశ్వరమ్మ, మృదంగంపై శివకుమార్, సుధాకర్, కంజీరాపై మహేశ్వర రావులు సహకారాన్ని అందించారు.
శ్రీరామసేవాసమితి డాక్టర్ ఉలిమిరి సోమయాజులు, విజయాదిత్యలు పాల్గొన్నారు