ప్రముఖ న్యాయవాదులు వామన్ రావు నాగమణి దంపతులను దారుణంగా హత్య చేయించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్, టీఆర్ఎస్ నాయకుడు పుట్టా మధును వెంటనే అరెస్టు చేయాలని ఎంఆర్పిఎస్ అంబర్ పేట నియోజకవర్గ ఇంచార్జి బడుగుల బాలకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
వామన్ రావు నాగమణి దంపతుల హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. మంద కృష్ణ మాదిగ అదేశాల మేరకు సోమవారం అంబర్ పేట చౌరస్తా రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ఈ కేసు ను సీబీఐ చే విచారణ జరిపించాలని హత్య చేసిన చేయించిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో రమేష్, ఈటా దర్శన్, రాజు, ఎంఏస్ఫ్ విజయ్ షేకిల్ నర్సింహ, దాస్, రాజు, లింగేష్, ఆకాష్, రమణ, తదితరులు పాల్గొన్నారు.