ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రంగా వున్న నేచర్ క్యూర్ హాస్పిటల్ ను జి హెచ్ ఎం సి మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. ఇక్కడ అందుబాటులో వున్న వైద్య సేవలు, టెస్టింగ్ సదుపాయాలు గురించి నోడల్ ఆఫీసర్స్ డా శ్యామల, రేవతి,సూపరింటెండెంట్ డా. భవాని లతో మాట్లాడారు.
క్వారంటైన్ వార్డును పరిశీలించారు. అంకితభావంతో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందిని అభినందించారు. హాస్పిటల్ ఆవరణలో కోవిడ్ -19 వైరస్ క్రిమి సంహారక మందు స్ప్రేయింగ్ ను పరిశీలించారు.