లండన్ వెళ్లే వారికి శుభవార్త.
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న భారత పౌరులు తమ దేశంలోకి వచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించింది.
ఇప్పటి వరకూ బ్రిటన్ వెళ్లే వారు అక్కడ 10 రోజుల పాటు హోటల్ లో క్వారంటైన్ లో ఉండాలనే నిబంధన ఉండేది.
ఆ నిబంధనను ఎత్తివేశారు.
రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న భారతీయ పౌరులు ఇక క్వారంటైన్ నిబంధన పాటించాల్సిన అవసరం లేదు. ఇది ఒక రకంగా భారత్ లో జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బ్రిటన్ గుర్తించినట్లే అవుతుంది.