28.7 C
Hyderabad
April 25, 2024 06: 03 AM
Slider ప్రత్యేకం

స‌త్యంన్యూస్.నెట్ కు స్పంద‌న‌…పోలీసుల‌లో క‌దిలిక‌..! ఎస్ఐ స‌స్పెన్ష‌న్

satyamnews

ఈ నెల 8 వ తేదీన స‌త్యం న్యూస్.నెట్ లో ప్ర‌చురిత‌మైన త‌ర‌లిపోతున్న గో  సంప‌ద వార్త పోలీసుల‌లో క‌ద‌లిక తెప్పించింది.

దాదాపు వంద ఆవులు త‌ర‌లిపోతున్నాయ‌న్న వార్త‌ను స‌మాచారం తెలుసుకున్న వెంట‌నే స‌త్యంన్యూస్.నెట్ ప్ర‌తినిధి…ఫోటోల‌తో స‌హా ప్ర‌చ‌రించారు.

అంతే గాక  ఆవుల త‌ర‌లింపుపై పోలీస్ శాఖ చేస్తున్న చ‌ర్య‌ల‌పై కూడా విజ‌య‌న‌గ‌రం డీఎస్పీ ని  వివ‌ర‌ణ కూడా కోరారు. దీంతో త‌క్ష‌ణం స్పందించిన డీఎస్పీ…ఆవుల అక్ర‌మ త‌ర‌లింపు  చ‌ట్ట విరుద్ద‌మ‌ని…క‌చ్చితమైన ఫిర్యాదు వస్తే త‌ప్ప‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

కొద్ది రోజుల క్రిత‌మే భోగాపురం పీఎస్ పరిధిలో 93 ఆవులు త‌ర‌లిపోతున్నాయ‌న్న వార్త ను స‌త్యంన్యూస్.నెట్ ప్ర‌చురించింది. దీనిపై పోలీస్ శాఖ స్పందించి…స‌ద‌రు ఎస్ఐ ను స‌స్పెండ్ చేసిందికూడ‌.

అయితే ఆవుల త‌ర‌లింపు…పెద్ద  మాఫియాగా సాగుతోంద‌ని..స‌మాచారం. గోశాల‌,క‌బేళా..రైతు ముగ్గురూ క‌లిసి…ఆవుల‌ను అక్ర‌మంగా స‌రిహ‌ద్దుల‌ను దాటించేస్తున్నార‌ని స‌మాచారం.

ఇదే విషయం పై డీఎస్పీ అనిల్ మాట్లాడుతూ…ఈ ఆవుల అక్ర‌మ త‌ర‌లింపు..క‌చ్చిత‌మైన స‌మాచారం  తెలిస్తే…ఎంత‌టి వారు ఉన్నా చ‌ట్ట‌పరంగా ఎవ్వ‌రినీ వ‌ద‌లి పెట్ట‌మ‌ని స్ప‌ష్టం చేసారు.

Related posts

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పై జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ

Satyam NEWS

రేట్ కంట్రోల్: ధరలు తగ్గేవి, ధరలు పెరిగేవి ఇవే

Satyam NEWS

చివరి గింజ కూడా కొంటాం

Bhavani

Leave a Comment