37.2 C
Hyderabad
March 29, 2024 17: 46 PM
Slider తెలంగాణ

భారత్ బచావో ప్రదర్శనకు తెలంగాణ నుంచి 4 వేల మంది

r c kuntia

డిసెంబర్ 14వ తేదీన ఏఐసీసీ ఢిల్లీలో చేపట్టిన భారత్ బచావో సభకు తెలంగాణ నుంచి పెద్దఎత్తున తరలి రావాలని ఏఐసీసీ ఇంచార్జ్ ఆర్.సి కుంతియా పిలుపునిచ్చారు. బుధవారం నాడు గాంధీభవన్ లో ముఖ్య నాయకులతో సమావేశమై ఢిల్లీసభ గురించి సమీక్ష నిర్వహించారు.

ప్రతి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి కనీసం 10 మంది నాయకులతో పాటు ఏఐసీసీ, పీసీసి అఫిస్ బేరర్లు, డీసీసీలు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు మొత్తం 23 కేటగిరి ల నుంచి సుమారు 4 వేల మంది నాయకులు ఢిల్లీకి తరలి రావాలని అన్నారు.

ఈ సమావేశంలో మాజీ ఎల్పీ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, కార్యనిర్వాహక అధ్యక్షులు కుసుమ కుమార్, ఎమ్యెల్యే జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజా సంపద పరిరక్షణకే సమ్మె

Sub Editor 2

సినీ దర్శకుడు వంశీ ‘పసలపూడి కథలు’పై పరిశోధనకు డాక్టరేట్

Satyam NEWS

హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో నరసరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు పర్యటన

Satyam NEWS

Leave a Comment