కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో రథసప్తమి ఈ సందర్భంగా సూర్యారాధన జరిగింది.
రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో అక్కమహాదేవి అలంకార మండపం వద్ద సూర్యారాధన వంటి ప్రత్యేక పూజలను అర్చకులు, వేద పండితులు నిర్వహించారు.
ప్రత్యేక పూజలు ఈవో కె.ఎస్.రామారావు దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగాసూర్య యంత్ర పూజ, చతుర్వేద పారాయణలు, అరుణ పారాయణలు జరిపించారు.
మధ్యాహ్నం 12 గంటలకు సూర్య భగవానుడికి విశేషంగా షోడశోపచార పూజ నిర్వహించారు. ఉదయం ఆలయ దక్షిణ మాడ వీధి లో సూర్య నమస్కారాలు చేశారు.