36.2 C
Hyderabad
April 25, 2024 20: 03 PM
Slider కర్నూలు

మహానంది పుణ్యక్షేత్రంలో వైభవంగా రధోత్సవం

#Mahanandi

కర్నూలు జిల్లా  లోని ప్రముఖ శైవక్షేత్రమైన మహానంది  క్షేత్రంలో స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన శనివారం స్వామి అమ్మవార్లు రథోత్సవం పై పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు.

ఈ రథోత్సవ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు, వేదపండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు. మహానంది క్షేత్రం మొత్తం శివ నామస్మరణతో మార్మోగిపోయింది. ఓం నమశ్శివాయ, హర హర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు ఆ శివుని నామాన్ని ఉచ్చరిస్తూ రథోత్సవంలో పాలుపంచుకున్నారు.

రాష్ట్రం లోని పలు ప్రాంతాల నుంచి మహానంది ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ స్వామి అమ్మవార్ల కృప కటాక్షాలు పొందారని ఆలయ పూజారులు తెలిపారు.

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పోలీస్ శాఖ మరియు ప్రభుత్వ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ఈ బ్రహ్మోత్సవాలను విజయవంతంగా పూర్తి చేశారు.

Related posts

వ్యవసాయ మార్కెట్ కమిటీ రిజర్వేషన్లు ఖరారు

Satyam NEWS

మాదకద్రవ్యాల హబ్ గా నరసరావుపేట

Satyam NEWS

అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు

Satyam NEWS

Leave a Comment