కర్నూలు జిల్లా శ్రీశైలమహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల రథోత్సవం శుక్రవారం రమణీయంగా సాగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ వేడుకలలో అశేష భక్త జనం పాల్గొని తరించారు.
ఈ కార్యక్రమానికి ముందుగా స్వామి వారి ఆలయ ప్రాంగణం నుండి ఉత్సవమూర్తులను వేద మంత్రోచ్ఛారణలతో మంగళవాయిద్యాల నడుమ పల్లకిలో ఊరేగి స్తూ రథశాల వద్దకు చేర్చారు .అక్కడ రథాంగ పూజ, హోమం, రథాంగ బలి శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అనంతరం స్వామి అమ్మవార్లను ఉత్సవమూర్తులను రథంలో కూర్చోబెట్టి అశేష భక్తజన వాహినికి మధ్య ముందుకు కదిలించారు. ఈ సమయంలో శ్రీశైల క్షేత్రం ఓం నమశ్శివాయ పంచాక్షరి ప్రణవనాదం తో మారుమ్రోగింది.
రథశాల నుంచి బయలుదేరిన రథం నంది మండపం వరకు వెళ్లి తిరిగి అక్కడి నుంచి రథశాల కు చేరుకుంది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో కె ఎస్ రామారావు అర్చకులు వేద పండితులు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు