ఒంటిమిట్టలో ప్రసిద్ద శ్రీ కోదండ రామ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలల్లో భాగంగా సీతా లక్ష్మణ స్వామి వారు రథోత్సవ కార్యక్రమం జరిగింది. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం పగలు స్వామి వారు రథోత్సవం జరుగవలసి ఉండగా ప్రత్యామ్నాయంగా ఆలయంలోనే సీతారాముల వారికి లక్ష్మణ స్వామివారికి పూజలు నిర్వహించారు.
ఈ వేడుకలను టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ల్లో భాగంగా ఎనిమిదో రోజు ఈ కార్యక్రమంను ఆలయ ప్రాంగణంలో వేదపండితులు, టీటీడీ అధికారులు మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా నిర్వహించారు. వాహన సేవలు ఆలయం లోపలే ఉంచి ఊరేగింపు నిర్వహించ కుండా పూజలు నిర్వహించారు.