31.7 C
Hyderabad
April 25, 2024 01: 29 AM
Slider పశ్చిమగోదావరి

అంతర్వేది ఘటన హిందూ మతంపై దాడి

#RaghuramakrishnamRaju

అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ రథం కాలిపోవడం దురదృష్టకరమని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం ఎంపీ కె.రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.

అంతర్వేది రథోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, రథం కాలిపోయిన విధానం చూస్తుంటే ఒక కుట్ర ప్రకారం జరిగినట్లు అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు.

ఒక మతంపై జరిగిన దాడిలా ప్రజలు భావించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటన చేయాలని ఎంపీ కోరారు.

ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరిగినా పిచ్చోడు చేశాడంటూ కేసులు కొట్టేస్తున్నారని విమర్శించారు. అలా కాకుండా విచారణ జరిపి బాధ్యులెవరైనా, ఏ మతస్థులైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

కార్మికుల చట్టాలను రక్షించుకోవడానికి ఐక్యంగా పోరాడాలి

Satyam NEWS

దోచుకుంటున్న ప్రయివేటు ఆసుపత్రులు

Satyam NEWS

అర్హులైన వారందరికి రుణ మాఫీ అందాలి

Bhavani

Leave a Comment