వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపూర్ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ఆయోధ్యలో నిర్మించే రామాలయానికి విరాళం అందచేశారు. ఆంధ్రప్రదేశ్ లో మత మార్పిడులపై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసి జాతీయ స్థాయిలో కొత్త చర్చకు తెరతీసిన కె.రఘురామకృష్ణంరాజు అయోధ్య రామాలయానికి విరాళం ఇవ్వడం సంచలనం కలిగిస్తున్నది.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంటు సభ్యుడుగా ఉన్న రఘురామకృష్ణంరాజు తన మూడు నెలల వేతనాన్ని రామాలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు.
రామలయ నిర్మాణం అనే బృహత్ కార్యక్రమానికి తన వంతుగా ఈ చిన్ని విరాళం అందచేస్తున్నట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు. రావణాసురుడిపై రాముడి పోరాటంలో ఇది ఒక ఉడతసాయం అని ఆయన అన్నారు.