రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ ను విధుల్లోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తీసుకున్న నిర్ణయం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపూర్ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు.
అయితే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఎలాంటి కిరికిరి పెట్టకుండా అమలు చేయాలని ఆయన కోరారు. డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తన బాధ్యతలను నిర్వర్తించేందుకు ప్రభుత్వం సహకరించాలని రఘురామకృష్ణంరాజు కోరారు.