లాక్డౌన్ సందర్భంలో ఇంటికే పరిమితమైన పేదలు ఆకలితో ఇబ్బందులు పడకుండా అండగా నిలిచారు మధుర ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాగిడి లక్ష్మారెడ్డి. అన్నా అంటే నేనున్నాను అంటూ ముందుకు వచ్చిన ఆర్ ఎల్ ఆర్, రామంతపూర్ వెంకట్ రెడ్డి నగర్ లో పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేసి సేవా దృక్పథాన్ని చాటుకున్నారు.
ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసి ఆకలి తీర్చారు. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గా పేదల గుండెల్లో నిలిచిన లక్ష్మారెడ్డి విపత్కర సమయంలో ఆకలి తీర్చడం దేవునితో సమానం పలువురు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎల్ ఆర్ యూత్ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొని సేవలు అందించారు.