32.2 C
Hyderabad
March 29, 2024 21: 23 PM
Slider గుంటూరు

రహీమ్ అండ్ ఖాసీం మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

#Dr.Chadalawada

గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం పట్టణ శివార్లలోని కృష్ణ చైతన్య విద్యా సంస్థల మైదానంలో రహీమ్ అండ్ ఖాసీం  మెమోరియల్ క్రికెట్ ట్రోఫీ పోటీలు ప్రారంభమయ్యాయి.

ఈ టోర్నమెంట్ ను నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్-ఛార్జ్ డాll చదలవాడ అరవింద బాబు ప్రారంభించారు.  

ముందుగా పోటీలకు హాజరయిన క్రీడాకారులను పరిచయం చేసుకుని తర్వాత టాస్ వేసి పోటీలను ఆరంభించారు.

ఈ సందర్భంగా డాll చదలవాడ మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో ఇండియన్ క్రికెట్ గొప్ప స్థానంలో ఉందని గుర్తు చేశారు.క్రికెట్ లో బాగా రాణించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. క్రికెట్ క్రీడాభివృద్ధికి టిడిపి ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజేటి వెంకటేష్, వల్లెపు నాగేశ్వరరావు,గొట్టిపాటి జనార్ధన్ బాబు,పులిమి రామిరెడ్డి,కొల్లి బ్రహ్మయ్య, చల్లా సుబ్బారావు,

పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరు శేఖర్, సుభాని, మీరావలి, గురవయ్య,మస్తాన్, ఖాసిం,నజీర్,కోలా సంజీవరావు, కావూరి శీను, బాబావలి,ఐలా గోపి,డాక్టర్ పిర్, ఏ.వి.ఆర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

శ్రీశ్రీశ్రీ కామాక్షి సమేత త్రేత్రేశ్వర స్వామి మహాశివ రాత్రి బ్రహ్మోత్సవాలు

Bhavani

ఎవరి పైకి వదిలారో తెలియదు కానీ సరిగ్గా గుచ్చుకుంది

Satyam NEWS

అనితర సాధ్యం మీ మార్గం

Satyam NEWS

Leave a Comment