కేవలం ఇద్దరు పారిశ్రామిక ఫ్రెండ్స్ కోసం దేశంలోని రైతాంగం మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడీ అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు ఆయన పార్లమెంట్కు ట్రాక్టర్పై వచ్చారు. తన నివాసం నుంచి పార్లమెంట్ వరకు ట్రాక్టర్ మీదనే వచ్చిన రాహుల్ గాంధీ వినూత్నంగా నిరసన తెలిపారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ట్రాక్టర్కు హోర్డింగులు కట్టారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో పాటు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీతో కలిసి ట్రాక్టర్ మీద రణీప్ సుర్జేవాలా, దీపెందర్ హుడా అనేక ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.