అత్యాచారానికి గురైన ఒక దళిత బాలికకు న్యాయం చేయాలంటూ రాహుల్ గాంధీ ట్వీట్ పెట్టడంపై అభ్యంతరాలు రావడంతో ఆయన ట్విట్టర్ ఎకౌంట్ ను నిలిపివేశారు.
రాహుల్ గాంధీ ఆ దళిత బాలిక కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న ఫొటోను కూడా ట్విట్ లో ఉంచడంపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సంస్థ అభ్యంతరం చెబుతూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైనర్ అయిన ఆ బాలిక వివరాలు బయటకు చెప్పడం బాలిక హక్కులకు భంగం కలిగించేదిగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
జువెనైల్ జస్టిస్ చట్టం ప్రకారం ఇది నేరమని అందువల్ల ఆ ట్వీట్ ను తొలగించాలని ఫిర్యాదులో పేర్కొనడంతో ఢిల్లీ పోలీసులు చర్యలకు ఉపక్రమించడంతో ట్విట్టర్ రాహుల్ గాంధీ ఖాతాను నిలిపివేసింది. ఢిల్లీలో జరిగిన ఈ అత్యాచారం సంఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. బాలిక కుటుంబానికి న్యాయం జరిగే వరకూ తాను వారి తరపున పోరాడతానని రాహుల్ గాంధీ అన్నారు.
ట్విట్టర్ లో ఆయన హిందీలో చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి ‘‘ తల్లిదండ్రుల కన్నీరు ఒకే విషయాన్ని అడుగుతున్నాయి… తమ కుమార్తెకు…. ఈ దేశం కుమార్తెకు న్యాయం కావాలి…. న్యాయం జరిగే వరకూ నేను వారితోనే ఉంటాను’’ ట్విట్టర్ ఖాతా స్థంభింప చేయడంపై కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానిస్తూ రాహుల్ గాంధీ ఇతర మాధ్యమాల ద్వారా ప్రజలతోనే ఉంటారని తెలిపింది.