రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నవంబర్ 1 వ తేదీన శంషాబాద్ మీదుగా ఉదయము 9 గంటలకు హైదరాబాద్ నగరములోని ఆరాంఘర్ కు చేరుకుంటుందని పిసిసి ప్రకటించింది. అక్కడ నుండి 10.30 గంటలకు తాడ్ బండ్ వద్ద గల లెజెండ్ ప్యాలెస్ చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారని , సాయాంత్రము 4 గంటలకు పురానాపూల్ వద్ద ప్రారంభమై హుస్సేనిఆలం, లాడ్ బజార్ మీదుగా 4.30 గంటలకు చార్మినార్ కు చేరుకుంటుందని తెలిపింది. 1990 అక్టోబర్ 19 వ తేదీన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పార్టీ పతాకాన్ని ఎగుర వేసి జంట నగరాలలో సద్భావనా యాత్రా ప్రారంభించిన రాజీవ్ గాంధీ సద్భావనా యాత్రా స్మారక స్తంభంపై రాహుల్ గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని, ఆ తర్వాత గుల్జార్ హౌజ్, మదీనా, నయాపూల్, ఉస్మాన్ గంజ్, మొజాంజాహి మార్కెట్, గాంధీభవన్, నాంపల్లి, పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీ, ఎ.జి ఆఫీస్, ఎన్ టి ఆర్ గార్డెన్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకుని కార్నర్ లో మీటింగ్ జరుగుతుందని తెలిపింది. హైదరాబాద్ నగర ప్రజలు రాహుల్ యాత్ర లో అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ణప్తి చేసింది.
previous post
next post