జూన్ 1 నుంచి సాధారణ రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ సన్నద్ధమౌతున్నది. జూన్ 1 నుంచి సమయానుకూలంగా రోజుకు 200 రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. త్వరలోనే రైళ్లకు సంబంధించిన టైమ్ టేబుల్ ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
ముందస్తు రిజర్వేషన్ చేయించుకున్న వారికి మాత్రమే రైలు ప్రయాణానికి అవకాశం ఉంటుందని.. కౌంటర్ల ద్వారా టికెట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. వలస కార్మికుల కోసం నడిపే 200 శ్రామిక్ రైళ్లతోపాటు అదనంగా మరో 200 సాధారణ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి నాన్ ఏసీ రైళ్లు మాత్రమే నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.