28.7 C
Hyderabad
April 20, 2024 07: 37 AM
Slider ముఖ్యంశాలు

ZRUCC కమిటీ మెంబర్ గా యరగాని నాగన్న గౌడ్

#uttam

నల్లగొండ పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్  రెడ్డి చేతుల మీదుగా యరగాని నాగన్న గౌడ్ ZRUCC (దక్షిణ మధ్య రైల్వే జోనల్ యూజర్స్ కన్సాల్టేటీవ్) సభ్యునిగా నియామక ధృవ పత్రాన్ని అందుకున్నారు.

బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాగన్న గౌడ్ మాట్లాడుతూ INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2013వ, సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంచే శ్రమశక్తి అవార్డు అందుకున్నట్లు చెప్పారు.

తన సేవలకు గుర్తింపుగా రైల్వే జోనల్ల (ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర)కన్సాల్టేటీవ్ సభ్యునిగా నియమించటం ద్వారా రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాల పరిశీలన చేసినట్లు చెప్పారు.

ప్రజలకు అవసరమైన వాటిపై అవగాహనతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ,కార్మికుల సదుపాయాల కొరకు తగు సూచనలు చేస్తుంటానని అన్నారు. నల్లగొండ పార్లమెంటు సభ్యుడు N.ఉత్తమ్ కుమార్ రెడ్డి తనపై నమ్మకముంచి ఇచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని యరగాని నాగన్న గౌడ్ అన్నారు.

ఈ సందర్భంగా MP,TPCC అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి, INTUC జాతీయ అధ్యక్షుడు జి. సంజీవరెడ్డికి,NFIR ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్యకి నాగన్న గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు, బాచిమంచి గిరిబాబు, జక్కుల మల్లయ్య, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమెరికాలో భారీ అగ్నిప్రమాదం..

Sub Editor

హుజూర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ

Satyam NEWS

వరద నీటిలో కొట్టుకుపోయిన అన్నదమ్ములు

Satyam NEWS

Leave a Comment