సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర వేణుగోపాల స్వామి ఆలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ యూజర్స్ కమిటీ సభ్యుడు యరగాని నాగన్న గౌడ్ శుక్రవారం స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నాగన్న గౌడ్ మాట్లాడుతూ వేల సంవత్సరాల చరిత్ర కలిగిన చారిత్రాత్మక శ్రీ సీతారామచంద్ర, వేణుగోపాల స్వామి వార్లు ఈ ప్రాత వాసుల ఆరాధ్యదైవమై నిత్యం పూజలు అందుకుంటున్నారని, స్వామి అమ్మవార్ల కృప అందరికీ కలిగి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,పైరు పంటలతో,పశు వృద్ది సుభిక్షంగా ఉండాలని అన్నారు.ఆలయ సంప్రదాయాల ప్రకారం దేవాలయ చైర్మన్ ముడుంబ జగన్నాథచార్యులు నాగన్న గౌడ్ ను స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి, సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు నరగిరినాధుని మురళి ఆచార్యులు,ఐ ఎన్ టి యు సి నాయకులు బెల్లంకొండ గురవయ్య,మేళ్ళచెరువు ముక్కంటి, పోతనబోయిన రామ్మూర్తి,సలిగంటి జానయ్య, తదితరులు పాల్గొన్నారు.