32.7 C
Hyderabad
March 29, 2024 10: 46 AM
Slider ఖమ్మం

అందరికి ఆమోదయోగ్యమైన రీతిలోనే రైలు మార్గం

#Railways

ఖమ్మం జిల్లా ప్రజలకు ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా సమూల మార్పుతో పాపటపల్లి-మిర్యాలగూడ నూతన రైలు మార్గాన్ని అందరికి ఆమోదయోగ్యమైన రీతిలో నిర్మించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ (దిశ) కమిటీ చైర్మన్ నామా నాగేశ్వరరావు రైల్వే ఉన్నతాధికారులను కోరారు. ఐడిఓసి లోని సమావేశ

మందిరంలో దిశ కమిటీ సమావేశాన్ని చైర్మన్ నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ రహదారులు, పంచాయితీరాజ్, ఇర్రిగేషన్, విద్యుత్, మునిసిపల్, రైల్వే, డిఆర్డీఏ, వైద్య ఆరోగ్య, పరిశ్రమల శాఖలచే కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై చైర్మన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొలుత ప్రతిపాదించిన మిర్యాలగూడెం నూతన రైలు

మార్గం అలైన్ మెంట్ వల్ల ఖమ్మం రూరల్, ముదిగొండ, నేలకొండపల్లి మండలాల్లోని 12 గ్రామ పంచాయితీలకు చెందిన ప్రజలు, చిన్న సన్నకారు రైతులకు తీవ్ర నష్టం వాటిళ్లనుందని, ఇట్టి విషయమై 12 గ్రామాలకు చెందిన నాయకులు తనను కలిసి, సమస్యను వివరించి, గ్రామ పంచాయతీ తీర్మానం అందజేయగా, తాను కేంద్ర రైల్వే మంత్రికి, రైల్వే బోర్డు చైర్మన్, జనరల్ మేనేజర్లకు అందజేసి, ప్రత్యేకించి లేఖలు రాయడంతోపాటు రైల్వే మంత్రితో స్వయంగా మాట్లాడిన

ఫలితంగా, తొలుత ప్రతిపాదించిన అలైన్ మెంట్ మార్చేందుకు అంగీకరించడం జరిగిందని ఆయన తెలిపారు. అయితే మళ్ళీ సర్వే చేసి, సామాన్య ప్రజలకు, రైతులకు ఇబ్బంది లేకుండా కొత్త రైలు మార్గాన్ని నిర్మించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఆయన వివరించారు. వీలుంటే ఖమ్మం జిల్లాతో సంబంధం లేకుండా రైలు మార్గాన్ని నిర్మించే యోచన

చేయాలని ఆయన తెలిపారు. రైల్వే లో ప్రోటోకాల్ పాటించడం లేదని, పనుల ప్రారంభం, ఇతర విషయాల గురించి సమాచారం ఇవ్వడం లేదని ఆయన అన్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు సరైన చర్యలు తీసుకొని,

దిశ కమిటీ సమావేశానికి హాజరుకావాలని ఆయన తెలిపారు. ఏ ఏ ప్రాజెక్టులు ఏ ఏ దశలో ఉన్నది, ఎప్పటికి పూర్తి అయ్యేది వివరాలు సమర్పించాలన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవాలని, వారు అడిగే సమస్యలకు స్పందించాలని ఆయన తెలిపారు. జిల్లాలో సరిపోను చెక్ డ్యాం ల నిర్మాణం చేసుకున్నట్లు, రెండు పాంట్స్లు సమృద్ధిగా పండుతున్నట్లు ఆయన అన్నారు. అనధికార లే అవుట్లు, కాల్వల పూడ్చివేతపై చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.

విద్యుత్ కోతలు లేని రాష్ట్రం తెలంగాణ నే అని ఆయన అన్నారు. ఇండ్లపై హై టెన్షన్ తీగలు, విద్యుత్ స్తంభాల తరలింపు, కావాల్సిన చోట విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ట్రాన్స్ఫార్మర్స్ ల షిఫ్టింగ్ తదితర సమస్యలు ఉన్నచోట వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. వైద్యం విషయంలో రాష్ట్రం గొప్ప ప్రగతిని సాధించిందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను పెంచే విధంగా కృషి చేయాలన్నారు. పల్లె, బస్తీ దవాఖానాలు ఏర్పాటుచేసి,

పేద ప్రజల ముంగిట నాణ్యమైన ఉచితం వైద్యం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టి, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేపట్టి, నివారించదగ్గ అంధత్వ రహిత తెలంగాణ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మహిళ ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. క్రొత్తగా జిల్లాలో

క్రొత్త రహదారులు, బైపాస్, రోడ్ సేఫ్టీ, నిర్వహణ ల కోసం రూ. 2,114 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. పంపిన ప్రతిపాదనలు ఏ దశలో ఉన్నవి, ఎన్ని మంజూరు అయినవి నివేదిక సమర్పించాలన్నారు. ఖమ్మం-కురవి జాతీయ రహదారి అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుని, కేంద్ర మంత్రులకు లేఖలు వ్రాయడం వల్ల రూ.

124.80 కోట్లు మంజూరు అయినట్లు ఆయన అన్నారు. జిల్లాలో జాతీయ రహదారుల, రైల్వేలు, ఇతర సమస్యలపై ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రుల దృష్టి కి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చైర్మన్ అన్నారు. పరిశ్రమలు రావాలని, పరిశ్రమలతోనే అభివృద్ధి, ఉద్యోగాలు వస్తాయని, సమస్యలు ఉంటే పరిష్కరించాలని ఆయన తెలిపారు.

త్వరలో ఖమ్మంలో సిఐఐ ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన అన్నారు. బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీతో, దేశంలో రాష్ట్రం నెం. 1 స్థానంలో ఉన్నట్లు, రాష్ట్రంలో ఖమ్మం జిల్లాను నెం. 1 స్థానంలో నిలపాలని అన్నారు.

Related posts

పాకిస్తాన్ కు నిలిచిపోయిన అంతర్జాతీయ ద్రవ్య నిధి సాయం

Satyam NEWS

వేణుగానాలంకారంలో శ్రీరామచంద్రమూర్తి చిద్విలాసం..

Satyam NEWS

కాంగ్రెస్ నేతృత్వంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

Satyam NEWS

Leave a Comment