క్యుమోలో నింబస్ మేఘాలు వచ్చే సీజన్ కాదు..వర్షాకాలం అంతకన్నా కాదు. కానీ గడిచిన రెండు రోజుల నుంచీ ఏపీలో ని ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లాలో సాయంత్రం అయ్యేసరికి ఆకాశం మేఘావృతం అవుతోంది.
తాజాగా జిల్లా లో 14 వ తేదీన ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకూ కాసిన ఎండతో…రాత్రి వేడు గాల్పులు ఖాయమని జిల్లా ప్రజ పడుకోవాలంటే ఉన్నోళ్లు ఏసీల్లోనూ లేనోళ్లు ఆరుబయట, డాబాలు మిద్దెల పై పడుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇటువంటి తరుణంలో జిల్లా సాయంత్రం నాలుగు అయ్యేసరికి వెదర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశాన్ని మబ్బులు కమ్మేశాయి..చల్లటి గాలులతో విజయనగరం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
దీంతో నగర ప్రజలు కాస్త ఎండ వేడి మి నుంచీ ఉపశమనం పొందారు.