మీరు చదివిన క్యాప్షన్… అదేనండీ శీర్షిక… అబ్బ…హెడ్డింగ్ నిజమే. విజయనగరం లో గత మూడు రోజుల నుంచే మధ్యాహ్నం మూడు అయ్యేసరికి వాతావరణం మారిపోతోంది. అప్పటివరకు మాడు పగిలే ఎండతో బయట కాలు పెట్టాలన్న… వెహికిల్ తీయ్యాలన్న విజయనగరం ప్రజలకు భయపడుతున్నారు.
కానీ మధ్యాహ్నం మూడు దాటితే ఆకాశం మేఘావృతం అయి..సూరిబాబు కాస్త మబ్బుల్లో దాక్కోవడంతో వాతావరణం చల్లబడుతోంది.అలాగే మూడో రోజు అయిన 25వ తేదీ కూడా వాతావరణం చల్లబడింది.నీలిరంగు ఆకాశం కాస్త… సిమెంట్ రంగంలో కి మారి…ఎండదనం కాస్త చల్లదనం గా మారింది. దీంతో నగర ప్రజలకు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.