హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి రైతు వేదికకు నేడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి కృషితో హుజూర్ నగర్ రెవెన్యూ పరిధిలోని రైతుల కోసం ఈ రైతు వేదిక నిర్మించబోతున్నారు.
హుజూర్ నగర్ రెవిన్యూ రైతు బంధు సమితి కోఆర్డినేటర్ రాయల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు.