రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పై విమర్శలు చేసిన వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దిష్టి బొమ్మను కడప జిల్లా రాజంపేట ఆర్ అండ్ బి బంగాళా వద్ద శుక్రవారంనాడు దగ్ధం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మాజీ శాసన సభ్యుడు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు.
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణమరాజు కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు పట్టణ కన్వీనర్ పోలా శ్రీనువాసులు రెడ్డి ,పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు పసుపులేటి సుధాకర్,
పార్లమెంట్ జిల్లా అధికార ప్రతినిధి మర్రి రవి,రాజంపేట పట్టణ బూత్ కమిటీ కన్వీనర్ గోవిందు బాలకృష్ణ ,పలువురు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.