కడప జిల్లా రాజంపేట సబ్ కలెక్టర్ గా బుధవారం ఐఏఎస్ అధికారి కేతన్ గార్గ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆర్డీవో ధర్మచంద్రా రెడ్డి పాల్గొన్నారు.
కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికి పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను 2013 ఐ ఏ యస్ బ్యాచ్ కు చెందిన వ్యకి నని తెలిపారు.
తన స్వస్థలం రాజస్థాన్ అని తెలిపారు. విజయనగరం లో అసిస్టెంట్ కలెక్టర్ గా, విజయవాడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ముసోరీ లో శిక్షణ అనంతరం తాను రాజంపేట సబ్ కలెక్టర్ జాయిన్ అయ్యానని అందరి సహకారం కావాలని కోరారు.