27.7 C
Hyderabad
April 25, 2024 09: 14 AM
Slider కడప

మహాత్మా ఈ తహసీల్దార్ ను మన్నించు….

#RajampetTahasildarOffice

కడప జిల్లా రాజంపేట తహసీల్దార్ కార్యాలయంలో పూజ్య బాపూజీ చిత్ర పటానికి తీవ్ర అవమానం జరిగింది.

దేశ స్వాతంత్రం కోసం పోరాడి భావి తరాలకు, దేశానికి స్ఫూర్తిగా నిలిచిన మహాత్మాగాంధీ చిత్ర పటాన్ని తహసీల్దార్ రవిశంకర్ రెడ్డి కార్యాలయంలో కాకుండా బయట కార్యాలయ సిబ్బంది కూర్చునే కాళ్ళ దగ్గర పడేయడం విచారకరం.

 గాంధీజీ చిత్ర పటాన్ని ఇలా నిర్లక్ష్యంగా మూల పడేయడం వలన ప్రజలకు తహసీల్దార్ చెడు సంకేతాలు ఇవ్వడమే నని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జాతి కే పిత అయిన మహాత్మాగాంధీ జయంతి, వర్ధంతి ని దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని ప్రతి భారతీయులు వేడుకగా జరపడం ఆనవాయితీగా వస్తోంది.

అటువంటి గాంధీ చిత్ర పటాన్ని కార్యాలయ సిబ్బంది కాళ్ళు పెట్టి కూర్చునే చోటు పడేయడం విమర్శలకు తావిస్తోంది.

Related posts

సిఎం సొంత జిల్లాలో అడ్డులేని ఇసుక అక్రమ రవాణా

Satyam NEWS

వైకుంఠధామం నిర్మాణానికి భూమిపూజ

Satyam NEWS

ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్ల సంఘానికి విజయ్ నాయక్ ఎన్నిక

Satyam NEWS

Leave a Comment