సిరిసిల్ల సాంఘీక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం లో బాలికల పై లైంగిక వేధింపుల ఘటన పై కలెక్టర్ శ్రీక కృష్ణ భాస్కర్ ఆదేశాల మేరకు సాంఘీక సంక్షేమ అధికారులు వెంటనే స్పందించారు .జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఇ . రాజేశ్వరి సోమవారం రాత్రి వసతి గృహం ను సందర్శించి బాలికల పై వేధింపుల ఘటన పై వివరాలు అడిగి తెలుసుకున్నారు . అధైర్య పడవద్దని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు . బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు .
కాగా మంగళవారం సిరిసిల్ల ప్రభుత్వ ఎస్.సి.కళాశాల బాలికల వసతి గృహం క్యాటరింగ్ కాంట్రాక్టర్ టి. దేవయ్య , వంటమనిషి విజయమ్మ లపై సాంఘీక సంక్షేమ అధికారులు కేసు నమోదు చేసారు . టి. దేవయ్య కాంట్రాక్టును సస్పెండ్ చేసారు . సిరిసిల్ల ప్రభుత్వ ఎస్.సి.కళాశాల బాలికల వసతి గృహం వసతి గృహ సంక్షేమ అధికారి జి. భూదేవి ని జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ సస్పెండ్ చేసారు .
ఈ సందర్భంగా జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి శ్రీమతి ఇ . రాజేశ్వరి సోమవారం సాయంత్రం తన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు . ఘటన జరిగిన వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఎస్.సి.కళాశాల బాలికల వసతి గృహం ను సందర్శించి విద్యార్థినిల తో మాట్లాడమన్నారు . ప్రాథమిక విచారణ అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాధ్యుల పై చర్యలు తీసుకున్నామన్నారు . ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు .