తన బంధువుల శుభకార్యానికి వచ్చిన పదేళ్ల బాలికను ఓ కీచకుడు టాయ్లెట్లోకి తీసుకువెళ్లి ఆమెపై అత్యంత దారుణంగా అత్యాచారం చేయగా తీవ్ర రక్తస్రావంతో బాలిక అల్లాడిన సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో సంచలనం సృష్టించింది.నిశ్చితార్థ వేడుకలో ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసిన రాజు అనే 36 ఏళ్ల కేటరర్ అక్కడికి వచ్చిన పదేళ్ల బాలిక ఫై కామం తోకన్నేసాడు.పాపకు రాజు మాయ మాటలు చెప్పి టాయ్లెట్లోకి తీసుకువెళ్లి అత్యంత దారుణంగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలిక తల్లిదండ్రులు తమ కూతురి జాడ కోసం గాలించగా ఆమె తీవ్ర రక్తస్రావంతో టాయ్లెట్లో కనిపించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న రాజును చూసి అతన్ని దర్యాప్తు చేయగా అతనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానని అంగీకరించాడు. దీంతో బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేపిస్తున్నారు. నిందితుడైన రాజును అరెస్టు చేశారు.