32.2 C
Hyderabad
April 20, 2024 20: 32 PM
Slider నల్గొండ

హుజుర్ నగర్ ఆటో వర్కర్స్ యూనియన్ ఎన్నిక

#AutoWorkersUnion

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ రాజీవ్ గాంధీ ఆటో వర్కర్స్ యూనియన్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని  ఎన్నుకున్నారు.

అధ్యక్షుడిగా కస్తాల రవీందర్, ఉపాధ్యక్షుడిగా రెడపంగు రాము, ప్రధాన కార్యదర్శిగా దాసరి వీరబాబు, సహాయ కార్యదర్శి గా షేక్ అహ్మద్, కోశాధికారిగా ఎస్.డి. నిజాముద్దీన్, కార్యవర్గ సభ్యులుగా కల్లూరి రవీంద్ర కుమార్, ధరావతు రమేష్ ,చిట్టూరి గోపి, రేఖ వెంకటేష్, పుట్టపాక మధు, చింతకాయల నరసింహారావు, వడ్లానపు గోపి, ఎన్నికైనారు.

ఈ కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర  ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ మాట్లాడుతూ నూతన  కార్యవర్గ  సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఆటో కార్మికులు సంక్షేమం కోసం ఆటో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు.

ప్రభుత్వం కరోనా కాలంలో ఆటో కార్మికులకు ఒక్కొక్కరికీ పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి నాయకులు బెల్లంకొండ గురవయ్య, సలిగంటి జానయ్య, మేళ్లచెరువు ముక్కంటి ఆటో వర్కర్స్ యూనియన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

డ్రెస్‌కోడ్‌:కాశీ జ్యోతిర్లింగ దర్శనానికి సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందే

Satyam NEWS

చిరంజీవి-సల్మాన్ ఖాన్‌ల మెగా మాస్ ప్రభంజనం

Satyam NEWS

గుడ్ గవర్నెన్స్:పోలీసుల పట్ల గౌరవం పెంచేందుకు చర్యలు

Satyam NEWS

Leave a Comment