సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ భారత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 76వ, జయంతి ఉత్సవ కార్యక్రమాల వేడుకలను ఘనంగా నిర్వహించారు.
హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు అధ్యక్షతన ముందుగా పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరాస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి మిఠాయిలు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా మల్లికార్జున్ రావు,INTUC జాతీయ కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, ప్రముఖ సీనియర్ నాయకుడు సాముల శివారెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రక్షాళన చేశారని, IT కమ్యునికేషన్ రంగాలలో ఆవశ్యకతను ముందుగా గుర్తించి ప్రాధాన్యతనిచ్చారని అన్నారు.
ఈనాడు భారతదేశం IT రంగాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడానికి రాజీవ్ గాంధీ కారణమని అన్నారు. యువతకు 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ కే దక్కుతుందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో టి.పి.సి.సి జాయింట్ సెక్రెటరీ ఎండి అజీజ్ పాషా, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు జక్కుల మల్లయ్య, కౌన్సిలర్ ములకలపల్లి రామగోపి, వెలిదండ వీరారెడ్డి, కారింగుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు
ఇంకా, ఇంటి మల్ల బెంజిమెన్, ముశం సత్యనారాయణ, మేళ్లచెరువు ముక్కంటి, షేక్ సైదా మేస్త్రి, చలువాది జానయ్య, దొంతగాని జగన్,సుదర్శన్, రజాక్ బాబా, కస్తాల సైదులు, షేక్ ఉద్దండు, ఉపేందర్, ఆవుల నాగేశ్వరరావు, నాగరాజు, సోమపంగు వీరబాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.