రాష్ట్రంలో తెలుగింటి ఆడపడుచులకు రక్షణ లేదంటూ విజయనగరం టీడీపీ నేతలు ఆరోపించారు. అనంతపురంలో దళిత యువతి హత్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసనలను చేపట్టింది. పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కూతురు.. విజయనగర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్దిని అధిత గజపతి రాజు ఆధ్వర్యంలో నగర టీడీపీ మహిళలు గంటస్తంభం నుంచీ మూడు లాంతర్ల వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లోని శంషాబాద్ సమీపంలో సాప్ట్ వేర్ ఇంజనీర్ ప్రియాంక రెడ్డి హత్య జరిగిన కొద్ది గంటలలోనే నిందితులను సైబరాబాద్ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని ఆ విధంగానైనా జగన్ ప్రభుత్వం దళిత అమ్మాయి హత్య కేసులో పోలీసులు వ్యవహరించలేదని ఆదితి విమర్శించారు. ఈ ప్రభుత్వం హాయంలోనే నేరాలు గణనీయంగా పెరిగిపోయాయని విజయనగర టీడీపీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.