33.2 C
Hyderabad
April 26, 2024 02: 02 AM
Slider ఆదిలాబాద్

అటవీ అధికారుల ర్యాలీ

#asifabad

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హత్యకు గురైన రేంజ్ అధికారి శ్రీనివాస్ రావు మృతికి సంతాపంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద  డీఎఫ్ఓ దినేష్ కుమార్ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ దినేష్ కుమార్ మాట్లాడుతూ ఫారెస్ట్ రేంజ్ అధికారి మృతి తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, సిబ్బందికి రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు పరండే సాయి, మహేష్, డిప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్ కుమార్, అరోజా రాణి, సెక్షన్ అధికారులు మహేందర్, భగవంత్ రావు,వెంకటేష్, విజయ్, ప్రకాష్, స్వప్న,తదితరులు పాల్గొన్నారు.

Related posts

వనపర్తి జిల్లాలో  తగ్గిన రోడ్డు ప్రమాదాలు

Satyam NEWS

తిరుమలలో పేరుకుపోయిన 4 కోట్ల రూపాయల నాణాలు

Satyam NEWS

పట్టపగలే కొల్లగొడుతున్న మట్టి మాఫియా

Satyam NEWS

Leave a Comment