30.7 C
Hyderabad
April 24, 2024 01: 51 AM
Slider కరీంనగర్

కొండగట్టులో రామపూజ స్థూపానికి భూమి పూజ

#MLCKavita

జగిత్యాల జిల్లా  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఉత్తర ద్వారం ముందు  రూ.90 లక్షల వ్యయంతో నిర్మించనున్న  రామకోటి స్తూపానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత,  మంగళవారం భూమి పూజ చేశారు.

అంతకుముందు కొండగట్టు ఆంజనేయస్వామి వారిని  దేవదాయ శాఖ మంత్రి అల్లోల  ఇంద్రకరణ్ రెడ్డి  దంపతులు, ఎమ్మెల్సీ కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు. దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన వారికి  దేవస్థాన కార్యనిర్వహణాధికారి, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో  స్వాగతం పలికారు.

Related posts

కరోనా నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలి

Satyam NEWS

బోనులో చిక్కిన చిరుతపులి

Bhavani

సీఎం కేసీఆర్ చిత్రపటానికి కాంట్రాక్ట్ అధ్యాపకుల క్షీరాభిషేకం

Satyam NEWS

Leave a Comment