యుగపురుషుడు బ్రహ్మర్షి స్వామి శ్రీ రామానంద పరమహంస అని స్వామి శ్రీ రామానంద యోగజ్ఞాన ఆశ్రమ పీఠాధిపతి శ్రీ గురూజీ అన్నారు. మహా సమాధి ఆరాధన సందర్భంగా ఆశ్రమంలో జరిగిన ఉపన్యాసం లో శ్రీ గురూజీ మాట్లాడారు.
అన్ని రోగులకు కఫమే కారణమని…ప్రాణాం పైకి వెళ్లక పోవడం వల్లనే జబ్బులకు కారణమన్నారు. మనలో ఉన్న ప్రాణాన్ని పైకి తీసుకెళ్లడమే ప్రాణాయామమని దాన్నే యోగమని అన్నారు. తల్లి గర్భంలో తొలుత ఆ ప్రాణం స్పందిస్తుందని..బయట కొస్తేనే జీవుడి అవతారిస్తాడని శ్రీ గురూజీ అన్నారు.
తల్లి గర్భంలో నవ మసాలు ఆ ప్రాణం ఉంటుందని బయట పడిన తర్వాత. నిశ్వాసగా మారుతుందని పంచ భూతాలుగ మారి కఫంగా మారి ఆ దాన్ని పోవాలంటే రాపిడి చేయాలని దాన్నే యోగమని దాన్ని పరమాత్ముల ద్వారా పొందాల్సి ఉంటుందన్నారు.
ఆశ్రమం లో స్వామీజీ మహా సమాధి ఆరాధన…!
స్వామి శ్రీ రామానంద యోగ జ్ఞాన ఆశ్రమంలో స్వామి రామానంద పరమహంసల వారి 29వ మహాసమాధి ఆరాధన కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. ఆశ్రమ పీఠాధిపతి, రిటైర్ డీఎంఅండ్ హెచ్ ఓ డా.వీ.వెంకటేశ్వరరావు శ్రీ గురూజీ ఈ స్వామీజీ సమాధి ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీగురూజీ ధర్మపత్ని పార్వతి అమ్మ తో పాటు ఆశ్రమ శిష్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.