28.2 C
Hyderabad
April 20, 2024 13: 01 PM
Slider ప్రత్యేకం

రామ తీర్ధం కొండ‌ రాముల వారి శిరస్సు భాగం లభ్యం

#Ramateerdham

రామతీర్ధం కొండపైన రామకొలనులో కోదండరామ విగ్రహ శిరస్సు లభ్యం అయింది. లోతైన కొలనులో ఉదయం నుండి జరిగిన గాలింపులో శ్రీరాముని తల కనిపించింది.

దాంతో భక్తుల హర్షాతిరేకాలతో  శ్రీరామ నామస్మరణతో రామతీర్దం మారుమ్రోగింది. ప్ర‌ఖ్యాతి  గాంచిన రామ‌తీర్దం కొండ‌పై రాముని విగ్ర‌హం ధ్వంసాన్ని నిర‌సిస్తూ..అధికార వైఎస్ఆర్సీపీ మిన‌హా అన్ని పార్టీలు  కొండ‌పైనే ధ‌ర్నాకు దిగాయి.

 ప్ర‌త్యేకించి హిందూ ధార్మిక సంస్థ‌లైన‌ విశ్వ‌హిందూ ప‌రిష‌త్, భ‌జ‌రంగ్ ద‌ళ్ తో పాటు బీజేపీ,టీడీపీలు సంయ‌క్తంగా ధ‌ర్నాలో పాల్గొన్నాయి.

నిన్న అంత‌ర్వేది..నేడు రామ‌తీర్ధం…రేపు మ‌రో దేవాల‌యం ధ్వంసం అంటూ  ధార్మిక సంస్థ‌లు జ‌రిగిన ధ్వంసాన్ని వ్య‌తిరేకిస్తూ ధ్వ‌జ‌మెత్తాయి.

ఇదిలా ఉంటే తెగిప‌డిపోయిన రాముని శిర‌స్సు ల‌భ్య‌మ‌వ‌డంతో పూజాది కార్య‌క్ర‌మాలు నిర్వ‌ర్తించి…పోలీసుల స‌హాకారంతో మ‌ళ్లీ కోవెల‌లో ప్ర‌తిష్టించారు…ఆల‌య అర్చ‌కులు.

చిన జీయరు స్వామి ఆశ్రమం ప్రతినిధులతో విగ్రహ శిరస్సు పునఃప్రతిష్ఠకు ఏర్పాట్లు చేయనున్నారు.

Related posts

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేద్దాం

Satyam NEWS

జనతా గ్యారేజ్: ట్రంప్ విధ్వంసానికి రిపేర్లు మొదలు

Satyam NEWS

కవచ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం

Satyam NEWS

Leave a Comment