32.2 C
Hyderabad
April 20, 2024 19: 41 PM
Slider చిత్తూరు

ఫెస్టివల్ గిఫ్ట్: జగనన్న రంజాన్ ఖదర్

#Srikalahasthi MLA

శ్రీకాళహస్తి నియోజక వర్గంలో రెండు రోజులు ముందుగానే రంజాన్ వేడుకలు ప్రారంభం అయ్యాయి. కారణం ఏమిటంటే రంజాన్ పండుగను పురస్కరించుకొని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణులకు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి “జగనన్న రంజాన్ ఖదర్” కానుక అందించారు.

దాదాపు 10 వేల కుటుంబాలకు 1 కేజీ బాస్మతి బియ్యం, టమాటా, ఎర్రగడ్డ , వంకాయి, బత్తాయి, క్యాబేజీ 1కేజీ చికెన్ ను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అలాగే మైనారిటీ ఆడపడుచులకు లాంఛనంగా “ప్రతి కుటుంబానికి ఒక చీరను” అందచేసి ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి మైనార్టీ సోదరులకు పెద్ద పీట వేసి ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. గత 45 రోజులుగా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ముస్లిం సోదర సోదరీమణులు జగనన్న రంజాన్ ఖదర్ ను అందచేస్తున్నట్లు చెప్పారు.

తన వంతు సాయంగా మైనారిటీ సోదర సోదరిమణులకు 50 టన్నుల కూరగాయలు, 10 టన్నుల చికెన్, 10 వేల చీరలు అందచేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం అన్నారు.

Related posts

బోయినపల్లికి ప్రణాళికా సంఘం

Satyam NEWS

గుడ్ వర్క్: పేదల ఆకలి తీర్చడమే ప్రధాన ఎజెండా

Satyam NEWS

జగన్మోహనంలో చిక్కుకున్న ఏపి ప్రభుత్వ ఉద్యోగులు

Satyam NEWS

Leave a Comment