35.2 C
Hyderabad
April 20, 2024 16: 30 PM
Slider నిజామాబాద్

బిచ్చుంద మండలంలో రంజాన్ కానుకలు పంపిణీ

#Bichkunda

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలకేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో పవిత్ర రంజాన్ మాసం పండుగ సందర్బంగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిరుపేదలైన ముస్లిం సోదరులకు  రంజాన్ కానుకలు పేరిట నూతన వస్త్రాలను పంపిణీ చేస్తోంది.

ఈ సందర్భంగా మంగళవారం ఎంపీపీ  అశోక్ పటేల్ రంజాన్ కానుకలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో పండుగలను జరుపుకోవాలన్న  ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు  ఇంతటి మహత్తరమైన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

రంజాన్ కు ముస్లిం సోదరులకు క్రిస్మస్ కు క్రైస్తవ సోదరులకు బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు వస్త్రాలను పంపిణీ చేయడం కొనసాగుతున్నది.

ఏ రాష్ట్రంలో లేని పథకాలు మన రాష్ట్రంలో ఉండటం మనకే గర్వకారణం అన్నారు. కార్యక్రమంలో      ఎంపిపితో పాటు వైస్ ఎంపీపీ రాజు పటేల్ ,తెరాస అధ్యక్షులు వెంకట్రావు దేశాయి, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రాజు ,సీనియర్ నాయకులు పాషా సెట్,  రెవెన్యూ ఇన్ స్పెక్టర్ సాయిబాబా తో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

అన్నమయ్య డ్యామ్ వరద ధాటికి అతలాకుతలం అయిన పరీవాహక గ్రామాలు

Satyam NEWS

హోమియోపతి వైద్య సృష్టి కర్త డా. హనీమన్ విగ్రహ ఆవిష్కరణ

Satyam NEWS

తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల..!

Satyam NEWS

Leave a Comment