హిందూ ముస్లిం సోదర భావాన్ని కలిగిస్తూ మత సామరస్యానికి మారుపేరుగా నిలిచిన ఉమామహేశ్వర రంగాపూర్ జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో రంగాపూర్ గ్రామం వద్ద ఉన్న నిరంజన్ షావలి దర్గా, ఉమామహేశ్వర క్షేత్రంలో శనివారం నుండి ఉత్సవాలు నిర్వహిస్తారు.
దక్షిణ తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి ఇ హిందువులు ముస్లింలు వేల సంఖ్యలో హాజరై నిరంతరం భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రంగాపూర్ లో వెలసిన నిరంజన్ షావలి దర్గా నందు మొక్కులు చెల్లించుకుని హిందువులు ముస్లింలు అనే తేడా లేకుండా ఉమామహేశ్వరుని దర్శించుకుని పులకరిస్తారు.