విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్య కుమారి…విద్యల నగరమైన విజయనగరం కు “సంక్రాంతి” శోభను తీసుకు వచ్చారు. ప్రతిష్టాత్మకంగా తన చొరవతో విజయనగరం పూల్ భాగ్ లో ‘శిల్పారామం” ప్రారంభం అయ్యింది.దీంతో అక్కడే పెద్ద పండుగ ను జిల్లా సమాచార ,ప్రజా సంబంధాల శాఖ ఏడీ రమేష్…ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆదేశాలతో శిల్పారామం లో రంగవల్లులు కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ మేరకు భోగీ ,సంక్రాంతి సందర్భంగా నగర ప్రజలు… మరీ ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లల చే ముగ్గులు వేసే కార్యక్రమం నిర్వహించారు.ఈ మేరకు రంగవల్లుల పోటీలలో అందరూ ఉత్సాహం వంతంగా పాల్గొనడం విశేషం. నగరంలోని శిల్పారామంలో ప్రారంభమైన రంగవల్లుల పోటీలను డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, మెప్మ పి.డి. బి.సుధాకర్, పర్యాటక అధికారి లక్ష్మీ నారాయణ పర్యవేక్షించారు.