నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని మహబూబ్ సుభాహని దర్గా దగ్గర జరిగిన గ్యార్మి పాతేహా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎండీ.హుస్సేన్ ఆహ్వానం మేరకు కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రంగినేని అభిలాష్ రావు పాల్గొన్నారు. అల్లా ఆశీస్సులతో కొల్లాపూర్ ప్రజలందరూ సుఖశాంతులతో కలసిమెలసి సుభిక్షంగా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆత్మీయ సోదరులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షుడు తగిలి కృష్ణయ్య, చిన్నకొత్తపల్లి గ్రామ అధ్యక్షుడు సైదులు, దేదినేనిపల్లి గ్రామ అధ్యక్షుడు కాశన్న, గంట్రావుపల్లి గ్రామ అధ్యక్షుడు మూర్తి, సీనియర్ నాయకులు హుస్సేన్, నరసింహ, సూర్య, ఆశ్రు, యూత్ కాంగ్రెస్ నాయకులు చేన్నకేశవులు, క్రిష్ణ, వంశీ, బాలకృష్ణ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
previous post